ఇంద్రకీలాద్రి ఈవో సురేష్ బాబు బదిలీ

ABN , First Publish Date - 2021-02-25T21:03:50+05:30 IST

ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఈవో సురేష్ బాబుపై బదిలీ వేటు పడింది. ఆయనపై సస్పెన్షన్ వేటు..

ఇంద్రకీలాద్రి ఈవో సురేష్ బాబు బదిలీ

విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఈవో సురేష్ బాబుపై బదిలీ వేటు పడింది. ఆయనపై సస్పెన్షన్ వేటు పడే అవకాశముంది. నాలుగు రోజులపాటు దుర్గగుడిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏసీబీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో చర్యలకు దిగింది. గత రెండేళ్లుగా జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అభియోగాలు మోపుతూ మరో నివేదికను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి పంపారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంత్రి వెల్లంపల్లి అనుచరుడే ఈవో సురేష్ బాబని, ఆయన హయాంలోనే అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి.

Updated Date - 2021-02-25T21:03:50+05:30 IST