దుర్గా నవరాత్రులు

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ఆదిపరాశక్తి ఽధరించి, దుష్ట రాక్షస సంహారం చేసిందనీ, క్షీరాబ్ధి పుత్రికగా అవతరించిన లక్ష్మీదేవి...

దుర్గా నవరాత్రులు

నేటి అలంకరణ శ్రీమహాలక్ష్మీదేవి

అశ్వయుజ శుద్ధ షష్ఠి-  శనివారం

శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరో రోజున 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ... 


శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్ని ఆదిపరాశక్తి ఽధరించి, దుష్ట రాక్షస సంహారం చేసిందనీ, క్షీరాబ్ధి పుత్రికగా అవతరించిన లక్ష్మీదేవి... డోలాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిందనీ పురాణాలు చెబుతున్నాయి. రెండు చేతులలో కమలాలు ధరించి, అభయ, వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా... భక్తుల అభీష్టాలను తీర్చే మహాలక్ష్మి సర్వ మంగళకారిణి. 


పురాణ కథల ప్రకారం, సృష్టి ప్రారంభంలో వటపత్రశాయిగా ఉన్న శ్రీమహావిష్ణువు సన్నిధికి ‘పరాశక్తి’ తన అంశయైున లక్ష్మీదేవిని పంపగా... ఆయనను ఆమె వరించింది. ప్రపంచ సంరక్షణలో భాగం పంచుకొనే శక్తిగా విష్ణువు సన్నిధిలో నిలిచిపోయింది. తిరిగి పాల సముద్ర మథన సమయంలో ఆవిర్భవించి, శ్రీమహావిష్ణువును లీలా కళ్యాణమాడి, దేవతలకు సామ్రాజ్యాన్ని ప్రసాదించింది. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్ముల సమష్టి రూపమైన మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ ఈ రోజు భక్తులను అనుగ్రహిస్తారు. ఈ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోని, పూజిస్తే... ధన , కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందనీ, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ, దారిద్య్రం, దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలూ కలుగుతాయనీ భక్తుల నమ్మిక. 


నైవేద్యం: రవ్వ కేసరి, గారెలు, చిత్రాన్నం, పాయసం

అలంకరించే చీర రంగు: గులాబీ (పింక్‌)

అర్చించే పూలు: తామర పుష్పాలు

పారాయణ: చెయ్యాల్సినవి: లక్ష్మీ స్తోత్రాలు

Updated Date - 2022-09-30T05:30:00+05:30 IST