తక్షణమే డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-09-28T05:18:13+05:30 IST

యాదగిరిగుట్ట, ఆలేరు మునిసిపాలిటీలో తక్షణమే డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.

తక్షణమే డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేయాలి
గుట్టలో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట రూరల్‌, సెప్టెంబరు 27: యాదగిరిగుట్ట, ఆలేరు మునిసిపాలిటీలో తక్షణమే డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం యాదగిరిగుట్టలో ఆలేరు, యాదగిరిగుట్ట, మునిసిపల్‌ పాలకవర్గాలు, అధికారులకు పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్త సేకరణపై అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెత్త సేకరణలో ముందున్నప్పటికీ డంపింగ్‌యా ర్డు లేకపోవడం ఇబ్బందిగా ఉందని, వెంటనే డంపింగ్‌ యార్డుల నిర్మాణం చేపట్టాలన్నారు. యాదగిరిగుట్టకు ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు, వీఐపీలు వచ్చివెళ్తారని, ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ పరిశుభ్రంగా ఉంటేనే అభినందిస్తారన్నారు. సెగ్రిగేషన్‌ యార్డు నిర్మాణాలు చేపట్టకపోతే వాటికి మంజూరైన నిధులు వృథా కాకుండా వేరే పనులకు వినియోగించాలన్నారు. యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తడి, పొడి చెత్తను ఏ విధంగా సేకరించాలనే అంశంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ము  నిసిపల్‌ చైర్‌పర్సన్లు ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, వస్పరి శంకరయ్య, కమిషనర్లు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, మారుతీ ప్రసాద్‌, ఏఈలు, యాదగిరిగుట్ట, ఆలేరు మునిసిపల్‌ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కనధారావు, వాసంలు డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు మల్లాపురంలో స్థలాన్ని పరిశీలించారు.  

Updated Date - 2022-09-28T05:18:13+05:30 IST