చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలి : ఆర్డీవో

ABN , First Publish Date - 2022-05-27T05:42:25+05:30 IST

గ్రామాల్లో చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని ఆర్డీవో పి.కిషోర్‌ సూచించారు.

చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలి : ఆర్డీవో
కైకలూరులో డంపింగ్‌ యార్డు స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో కిషోర్‌

కైకలూరు, మే 26 : గ్రామాల్లో చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని ఆర్డీవో పి.కిషోర్‌ సూచించారు. గురువారం కైకలూరు–దానగూడెంలో డంపింగ్‌ యార్డు నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. గ్రామంలో చెత్తను ఎక్కడ సేకరించినా సంపద తయారీ కేంద్రాలకు తరలించేలా చూడాల న్నారు. కైకలూరులో నూతనంగా ఏర్పాటు చేసే డంపింగ్‌ యార్డు స్థలంలో త్వరితగతిన మెరక పనులు చేయాలన్నారు. 

Updated Date - 2022-05-27T05:42:25+05:30 IST