NRI గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందనే కోపంతో రెచ్చిపోయి..

ABN , First Publish Date - 2022-02-22T03:57:29+05:30 IST

విదేశాలకు వెళ్లిపోయిన గర్ల్‌ఫ్రెండ్ తనను దూరం పెట్టిందనే కోపంతో రెచ్చిపోయిన ఓ యువకుడు ఆమెతో తన సన్నిహితంగా ఉన్నప్పటి చిత్రాలను సోషల్ మీడియాలో లీక్ చేసి చివరికి కటకటాల పాలయ్యాడు.

NRI గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందనే కోపంతో రెచ్చిపోయి..

ఇంటర్నెట్ డెస్క్:  విదేశాలకు వెళ్లిపోయిన గర్ల్‌ఫ్రెండ్ తనను దూరం పెట్టిందనే కోపంతో రెచ్చిపోయిన ఓ యువకుడు ఆమెతో తను సన్నిహితంగా ఉన్నప్పటి చిత్రాలను సోషల్ మీడియాలో లీక్ చేసి చివరికి కటకటాల పాలయ్యాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరానికి చెందిన పార్థ్ చంపానేరీ అనే యుకుడికి గతేడాది జనవరిలో ఓ యువతి సోషల్ మీడియాలో పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో వారు పరస్పరం దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఆమె అతడితో సన్నిహితంగా ఉన్న సమయంలో నిందితుడు గుట్టుచప్పుడు కాకుండా ఫోన్‌లో రికార్డు చేశాడు. 


ఇటీవల ఆమె పై చదువుల నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో క్రమంగా అతడితో మాటలు తగ్గిస్తూ వచ్చిన ఆమె చివరికి అతడిని పూర్తిగా దూరం పెట్టేసింది. దీంతో.. రెచ్చిపోయిన నిందితుడు తాను కెమెరాలో రికార్డు చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బాధితురాలి బంధువులకు కూడా పంపించాడు. దీంతో.. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు పార్థ్‌ను ఇటీవలే అరెస్టు చేశారు.

Updated Date - 2022-02-22T03:57:29+05:30 IST