Dasara: హైదరాబాద్లో ఉండే గుంటూరోళ్లకు గుడ్న్యూస్.. దసరాకు మీరు వెళ్లడానికి సికింద్రాబాద్ నుంచి..
ABN , First Publish Date - 2022-09-29T18:36:30+05:30 IST
ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లని నడపనున్నట్లు డివిజనల్ రైల్వే అధికారి బుధవారం ఒక ప్రకటనలో..
గుంటూరు: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లని (Two Special Trains Via Guntur) నడపనున్నట్లు డివిజనల్ రైల్వే అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెంబరు.07466 (Train Number 07466) నరసాపూర్ - సికింద్రాబాద్ రైలు (Narsapur to Secunderabad Special Train) ఈ నెల 30వ(శుక్రవారం) తేదీన సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10.40కి గుంటూరు, 11.23కి సత్తెనపల్లి, 11.55కి పిడుగురాళ్ల, శనివారం వేకువజామున 4.10కి సికింద్రాబాద్ చేరుకొంటుంది. నెంబరు. 076467 సికింద్రాబాద్ - నరసాపూర్ రైలు అక్టోబరు 1వ తేదీన శనివారం రాత్రి 9.05 గంటలకు బయలుదేరి 11.55కి పిడుగురాళ్ల, అర్ధరాత్రి దాటాక 12.20కి సత్తెనపల్లి, 1.45కి గుంటూరు, ఆదివారం ఉదయం 8.35కి నరసాపూర్ చేరుకొంటుంది.