భర్తను వదిలేసి వేరే వ్యక్తితో ఎదురింట్లోనే కాపురం పెట్టిన మహిళ.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-04-19T17:59:50+05:30 IST

వారిద్దరికీ 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. భార్యాభర్తలిద్దరూ ప్రతి చిన్న విషయానికీ తరచుగా గొడవపడుతుండేవారు..

భర్తను వదిలేసి వేరే వ్యక్తితో ఎదురింట్లోనే కాపురం పెట్టిన మహిళ.. చివరకు ఆమె పరిస్థితి ఏమైందంటే..

వారిద్దరికీ 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. ఇద్దరు పిల్లలు ఉన్నారు.. భార్యాభర్తలిద్దరూ ప్రతి చిన్న విషయానికీ తరచుగా గొడవపడుతుండేవారు.. భర్తతో పడకపోవడంతో ఆ మహిళ అదే ఊరిలో ఉన్న వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. కొన్ని రోజుల క్రితం భర్తను వదిలేసి పిల్లలను తీసుకుని ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది.. భర్త ఇంటికి దగ్గర్లోనే ప్రియుడితో కలిసి జీవనం మొదలుపెట్టింది.. తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త ఆమెను రాయితో కొట్టి చంపేశాడు. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలోని దతియా గ్రామానికి చెందిన రాజేందర్ అనే వ్యక్తి 11 ఏళ్ల క్రితం జ్యోతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా రాజేందర్, జ్యోతి ప్రతి చిన్న విషయానికి తరచుగా గొడవపడుతుండేవారు. భర్తతో పడకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఆకాష్ అనే వ్యక్తితో జ్యోతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. సంవత్సరం క్రితం భర్తను వదిలేసి పిల్లలను తీసుకుని ఆకాష్ ఇంటికి వెళ్లిపోయింది. అప్పట్నుంచి అతడితోనే కలిసి జీవిస్తోంది. 


ఆదివారం ఉదయం రాజేందర్ తన కొడుకును తన ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో జ్యోతి, రాజేందర్ మధ్య మళ్లీ గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రాజేందర్ ఓ పెద్ద రాయితో జ్యోతి తలపై కొట్టాడు. దీంతో జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-19T17:59:50+05:30 IST