కొత్త మోడల్లో డుకాటీ బైక్ విడుదల
ABN , First Publish Date - 2021-07-23T01:11:34+05:30 IST
కొత్త మోడల్లో డుకాటీ బైక్ విడుదల
న్యూఢిల్లీ: ప్రముఖ మోటార్సైకిళ్ల తయారీ సంస్థ డుకాటీ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. సరికొత్త మోడల్లో డుకాటీ ఇండియా 2021 మల్టీస్ట్రాడా వి4 బైక్ను ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది. భారత మార్కెట్లో డుకాటీ ఇండియా 2021 మల్టీస్ట్రాడా వి4 బైక్ను విడుదల చేసినట్లు సంస్థ వెల్లడించింది. డుకాటీ మల్టీస్ట్రాడా వి4 బైక్ ప్రారంభ ధర రూ. 18.99 లక్షలు ఉంటుంది. రెండు వేరియంట్లలో డుకాటీ మల్టీస్ట్రాడా వి4 బైక్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ వెల్లడించింది. వచ్చే వారం నుంచి బైక్ విక్రయాలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.