దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అరెస్ట్..
ABN , First Publish Date - 2021-06-18T22:44:30+05:30 IST
మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్న
సిద్దిపేట : మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం తెలంగాణలో పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని కేసీఆర్ సర్కార్పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆయన.. రైతు మల్లారెడ్డి ఆత్మహుతికి పాల్పడడం విచారకరమన్నారు. ఘటనాస్థలికి వెళ్తే అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. మసిపూసి మారెడుకాయ చేసే పనిలో అధికారులు ఉన్నారని.. సభ్యసమాజం తల దించుకునే విధంగా కేసీఆర్ పాలన ఉందని రఘునందన్రావు విమర్శలు గుప్పించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో మాట్లాడితే ఎందుకు అరెస్టులు చేస్తున్నారో..? అర్థం కావట్లేదని రఘునందన్ మండిపడ్డారు.