భారత్‌లోని 4 ల్యాబ్‌ల కొవిడ్ రిపోర్టులను తిరస్కరిస్తున్న దుబాయ్

ABN , First Publish Date - 2020-09-30T18:56:20+05:30 IST

భారతదేశంలోని నాలుగు లేబరేటరీల కొవిడ్ నెగిటివ్ పరీక్షల రిపోర్టులను దుబాయ్ పౌరవిమానయాన శాఖ(డీజీసీఏ) తిరస్కరించింది.

భారత్‌లోని 4 ల్యాబ్‌ల కొవిడ్ రిపోర్టులను తిరస్కరిస్తున్న దుబాయ్

న్యూఢిల్లీ: భారతదేశంలోని నాలుగు లేబరేటరీల కొవిడ్ నెగిటివ్ పరీక్షల రిపోర్టులను దుబాయ్ పౌరవిమానయాన శాఖ(డీజీసీఏ) తిరస్కరించింది. జైపూర్, కేరళ, ఢిల్లీ నగరాల్లోని నాలుగు లాబోరేటరీల్లో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు చేసి నెగిటివ్ రిపోర్టులు వచ్చినా వాటిని తాము తిరస్కరిస్తామని దుబాయ్ డీజీసీఏ ప్రకటించింది. జైపూర్ నగరంలోని సూర్యం ల్యాబ్, కేరళలోని మైక్రోహెల్త్ ల్యాబ్, ఢిల్లీలోని డాక్టర్ పి భాసిన్ పాత్ ల్యాబ్, నోబుల్ డయాగ్నస్టిక్ సెంటర్లలో జరిపిన కొవిడ్ నెగిటివ్ రిపోర్టులను తాము పరిగణనలోకి తీసుకోబోమని దుబాయ్ డీజీసీఏ ప్రకటించింది. ఇప్పటికే దుబాయ్ ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను నిషేధించింది. కొవిడ్-19 పాజిటివ్ రోగులను ఎయిర్ ఇండియా విమానాల్లో తీసుకువచ్చారంటూ దీనిపై దుబాయ్ డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Updated Date - 2020-09-30T18:56:20+05:30 IST