దుబాయి నుంచి వచ్చిన వారి ద్వారానే ఎక్కువ కేసులు
ABN , First Publish Date - 2020-03-29T09:28:37+05:30 IST
దుబాయి నుంచి వచ్చిన వారి ద్వారానే భారతదేశంలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తాజా అధ్యయనంలో తేలింది. మనదేశంలో కరోనా వ్యాప్తి ధోరణుల
- 65% పురుషులు, 35% మహిళలు
న్యూఢిల్లీ, మార్చి 28: దుబాయి నుంచి వచ్చిన వారి ద్వారానే భారతదేశంలో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తాజా అధ్యయనంలో తేలింది. మనదేశంలో కరోనా వ్యాప్తి ధోరణులపై తొలిసారిగా ఉత్తర ప్రదేశ్కు చెందిన సంతోష్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 720 పాజిటివ్ కేసులను విశ్లేషించగా, ఇందులో దాదాపు 100 మంది దుబాయి నుంచి వచ్చినవారిలోనే ఉన్నట్టు వెల్లడించింది. దుబాయి తర్వాత యూకే, ఇటలీ, సౌదీ అరేబియా, అమెరికా నుంచి వచ్చినవారిలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.