దుబాయి నుంచి వచ్చిన వారి ద్వారానే ఎక్కువ కేసులు

ABN , First Publish Date - 2020-03-29T09:28:37+05:30 IST

దుబాయి నుంచి వచ్చిన వారి ద్వారానే భారతదేశంలో ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తాజా అధ్యయనంలో తేలింది. మనదేశంలో కరోనా వ్యాప్తి ధోరణుల

దుబాయి నుంచి వచ్చిన వారి ద్వారానే ఎక్కువ కేసులు

  • 65%  పురుషులు, 35% మహిళలు

న్యూఢిల్లీ, మార్చి 28: దుబాయి నుంచి వచ్చిన వారి ద్వారానే భారతదేశంలో ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తాజా అధ్యయనంలో తేలింది. మనదేశంలో కరోనా వ్యాప్తి ధోరణులపై తొలిసారిగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సంతోష్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 720 పాజిటివ్‌ కేసులను విశ్లేషించగా, ఇందులో దాదాపు 100 మంది దుబాయి నుంచి వచ్చినవారిలోనే ఉన్నట్టు వెల్లడించింది. దుబాయి తర్వాత యూకే, ఇటలీ, సౌదీ అరేబియా, అమెరికా నుంచి వచ్చినవారిలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి.

Updated Date - 2020-03-29T09:28:37+05:30 IST