Viral: మేఘాలకి కరెంట్ షాకిచ్చి వర్షం కురిపించారు!

ABN , First Publish Date - 2021-07-22T21:46:06+05:30 IST

శాస్త్రజ్ఞులు ఓ వినూత్న ప్రయోగం చేశారు. మెరుపులతో భయపెట్టే మేఘాలకే వారు కరెంట్ షాకిచ్చారు. దీంతో.. మండువేసవిలోనూ ఒక్కసారిగా కుంభవృష్టి కురిసి, వాతావరణం చల్లబడింది.

Viral: మేఘాలకి కరెంట్ షాకిచ్చి వర్షం కురిపించారు!

దుబాయ్: అసలే ఎడారి ప్రాంతం.. ఆపై మండువేసవి..50 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..ఇటువంటి వాతావరణంలో ఉండాలంటే మామూలు విషయం కాదు. ఏసీలకు లొంగే వేడి కాదు అది. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా.. ఇంకెక్కడండీ.. దుబాయ్‌లోనే! అక్కడి ప్రజలు గ్రీష్మతాపాన్ని తట్టుకోలేక నానా అవస్తలూ పడుతున్నారు. 


దీంతో యూఏఈలోని నేషనల్ సెంటర్ ఫర్ మెటియొరాలజీ(వాతావరణ పరిశోధన కేంద్రం)లోని శాస్త్రజ్ఞులు ఓ వినూత్న ప్రయోగం చేశారు. మెరుపులతో భయపెట్టే మేఘాలకే వారు కరెంట్ షాకిచ్చారు. దీంతో.. మండువేసవిలోనూ ఒక్కసారిగా కుంభవృష్టి కురిసి, వాతావరణం చల్లబడింది. మేఘాలకు కరెంట్ షాక్ ఇచ్చే ప్రత్యేక వ్యవస్థలున్న డ్రోన్లను ఆకాశంలోకి పంపించి వర్షం కురిపించారు! నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కరెంట్ షాకుల ద్వారా మేఘాల్లో మార్పులు జరిగి వాన కురుస్తుందట. జోరున వానలో రహదారులపై దూసుకుపోతున్న కార్ల వీడియోను మెటియొరాలజీ కేంద్రం వారు ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.



Updated Date - 2021-07-22T21:46:06+05:30 IST