వివాదాస్పద భూమిని పరిశీలించిన డీఎస్పీ
ABN , First Publish Date - 2020-09-17T11:06:30+05:30 IST
మండలంలోని రామగిరి గ్రామంలో వివాదంలో ఉన్న భూమిని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి,స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రమణారెడ్డిలు
శాలిగౌరారం, సెప్టెంబరు 16: మండలంలోని రామగిరి గ్రామంలో వివాదంలో ఉన్న భూమిని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి,స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రమణారెడ్డిలు పరిశీలించారు. గామంలో సోదరులు నిమ్మల యాదయ్య, శ్రీశైలం మధ్య కొంతకాలంగా భూవివాదం ఉంది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. సమస్యను పరిష్కరించాలని అన్నదమ్ములు పోలీసులను ఆశ్రయించడంతో వివాదాస్పద భూమిని, హద్దు రాళ్లను డీఎస్పీలు పరిశీలించి అన్నదమ్ములతో మాట్లాడారు. నివేదికను ఎస్పీకి పంపి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వీరి వెంట శాలిగౌరారం సీఐ నాగదుర్గప్రసాద్, ఎస్ఐ వై.హరిబాబు, హెడ్ కానిస్టేబుల్ వై.శ్రీనయ్య ఉన్నారు.