పేకాట స్థావరంపై డీఎస్పీ దాడి
ABN , First Publish Date - 2021-01-14T06:00:43+05:30 IST
జంగారెడ్డిగూడెం పట్టణంలోని గాయిత్రి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో డీఎస్పీ రవికిరణ్ బుధవారం రాత్రి దాడులు జరిపి 20 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు.
జంగారెడ్డిగూడెం టౌన్, జనవరి 13: జంగారెడ్డిగూడెం పట్టణంలోని గాయిత్రి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో డీఎస్పీ రవికిరణ్ బుధవారం రాత్రి దాడులు జరిపి 20 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారందరు పట్టణ ప్రముఖులు కావడం విశేషం. ఇందులో అధికార పార్టీ పట్టణ అధ్యక్షుడు, పలువురు వ్యాపార వేత్తలు ఉన్నారు. వారి నుంచి 2 లక్షల 40 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.