అట్రాసిటీ కేసుపై డీఎస్పీ దర్యాప్తు

ABN , First Publish Date - 2021-04-13T05:17:17+05:30 IST

గురవాంలో ఈనెల 10న జరిగిన కొట్లాటలో నమోదైన అట్రాసిటీ కేసుకు సంబంధించి శ్రీకాకుళం ఎస్సీ,ఎస్టీ సెల్‌-1 డీఎస్పీ కె.బాలరాజు సోమవారం రాత్రి విచారణ చేపట్టారు.

అట్రాసిటీ కేసుపై డీఎస్పీ దర్యాప్తు
క్షతగాత్రుల నుంచి వివరాలు సేకరిస్తున్న డీఎస్పీ బాలరాజు

రాజాం రూరల్‌ : గురవాంలో ఈనెల 10న జరిగిన కొట్లాటలో నమోదైన  అట్రాసిటీ కేసుకు సంబంధించి శ్రీకాకుళం ఎస్సీ,ఎస్టీ సెల్‌-1 డీఎస్పీ కె.బాలరాజు సోమవారం రాత్రి విచారణ చేపట్టారు. ఈ మేరకు రాజాం సామాజిక ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులతో మాట్లాడి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. గురవాంలో ఈనెల 10న అర్ధరాత్రి దాటినయు  తర్వాత రెండు సామాజిక వర్గాల మధ్య కొట్లాట జరిగిన విషయం విదితమే. ఈ నేపథఽ్యంలో ఒక సామాజిక వర్గానికి చెందిన చందక బాబ్జీ తదితరులు తమను కులం పేరుతో దూషించి, గాయపరిచినట్లు మరో సామాజిక వర్గానికి చెందిన కె.గోపి తదితరులు రాజాం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రేవతి కేసు నమోదు చేయగా ఈ మేరకు సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపి తదితరుల నుంచి డీఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. 


Updated Date - 2021-04-13T05:17:17+05:30 IST