HYD : మద్యం మత్తులో కారుతో యువకుల బీభత్సం
ABN , First Publish Date - 2022-05-13T11:45:06+05:30 IST
మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో బీభత్సం సృష్టించారు.
హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో (Car) బీభత్సం సృష్టించారు. తమ ముందు వెళ్తున్న బైక్ను ఢీ కొట్టి గచ్చిబౌలి పోలీసులకు చిక్కారు. ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. హుడాకాలనీ దిల్సుఖ్నగర్కు చెందిన వట్టెం నిహాల్ (23), కొండాపూర్కు చెందిన లోహిత్(25)తో కలిసి మద్యం తాగారు. గురువారం సాయంత్రం 5.15 సమయంలో బీఎండబ్ల్యూ కారులో దూసుకువెళ్లారు. శ్రీరాంనగర్లోని మైహోం మంగళ అపార్ట్మెంట్స్ వద్ద ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టారు. వాహనంపై ఉన్న విజయ్కుమార్కు కుడిచేయి విరిగింది. మరో వ్యక్తి టి.సూర్యకు గాయాలయ్యాయి. గచ్చిబౌలి పోలీసులు వివరాలు సేకరిస్తుండగా నిహాల్, లోహిత్ వారితో వాగ్వాదానికి దిగారు. విధులకు ఆటంకం కలిగించారు. దీంతో వారిని పోలీస్స్టేషన్కు తరలించి డ్రంకెన్ డ్రైవ్ టెస్టు (Drunk and Drive) నిర్వహించగా నిహాల్కు 234/100, లోహిత్కు 501/100 వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.