Crime: మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన కొడుకు.. కన్నతల్లి పైనే..

ABN , First Publish Date - 2022-07-10T21:07:48+05:30 IST

మద్యపానం ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తోంది. ఎంతో మంది జీవితాలను దహించి వేస్తోంది.

Crime: మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన కొడుకు.. కన్నతల్లి పైనే..

మద్యపానం ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తోంది. ఎంతో మంది జీవితాలను దహించి వేస్తోంది. తాగుడు మహమ్మారికి బానిసైన వ్యక్తులు చేజేతులా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మద్యానికి బానిసై స్పృహ కోల్పోయాడు. తుపాకీతో కన్న తల్లిపైనే కాల్పులు జరిపాడు. 


ఇది కూడా చదవండి..

Uttar pradesh: ఛీ..ఛీ.. వీడసలు భర్తేనా.. స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం.. కారణమేంటో తెలిస్తే..


ఉత్తరప్రదేశ్‌లోని చౌవియా ప్రాంతంలోని నాగ్లా మర్దాన్ గ్రామానికి చెందిన శివ ప్రతాప్‌ అనే వ్యక్తి మద్యానికి బానిస. రోజూ మద్యం సేవించి ఇంటికి వెళ్లి ఇరుగుపొరుగు వారితో, కుటుంబ సభ్యులతో గొడపడేవాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన శివ ప్రతాప్‌ తన దగ్గర ఉన్న దేశీయ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఒక బుల్లెట్ అతని కన్నతల్లి శరీరంలోకి దూసుకుపోయింది.


బుల్లెట్ దూసుకెళ్లడంతో శివ ప్రతాప్ తల్లి ఊర్మిళా దేవి అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. తల్లి మరణించడంతో భయపడిన శివ ప్రతాప్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-07-10T21:07:48+05:30 IST