ముగ్గురు పిల్లలను బావిలోకి తోసేసిన తాగుబోతు తండ్రి.. తీవ్ర విషాదం

ABN , First Publish Date - 2022-05-01T22:44:40+05:30 IST

సుందర్‌గఢ్ : ముగ్గురు చిన్నారులపాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు. ముగ్గురినీ తీసుకెళ్లి బావిలోకి విసిరేసి ప్రాణాలు తీశాడు.

ముగ్గురు పిల్లలను బావిలోకి తోసేసిన తాగుబోతు తండ్రి.. తీవ్ర విషాదం

సుందర్‌గఢ్ : ముగ్గురు చిన్నారులపాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు. ముగ్గురినీ తీసుకెళ్లి బావిలోకి విసిరేసి ప్రాణాలు తీశాడు. తీవ్ర విషాదకరమైన ఈ ఘటనలో ఒడిశాలో శనివారం జరిగింది. నిందితుడు 21 ఏళ్ల పాండు ముండా శనివారం సమీపంలోని కోయిదా మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ ఫుల్‌గా మద్యం సేవించి రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. మద్యం మత్తులో భార్యతో ఘర్షణకు దిగాడు. తాగిన మైకంలో భార్యను గొడ్డలితో నరికేందుకు ప్రయత్నించాడు. భయపడిన భార్య ఇంట్లో నుంచి పారిపోయింది. భర్తకు భయపడి పొదల చాటున దాగుంది. భార్య కోసం కాసేపు వెతికిన పాండు ఇంటికి తిరిగొచ్చాడు. భార్యపై తన కోపాన్ని పిల్లలపై చూపించాడు. పిల్లల్ని తీసుకెళ్లి  బావిలో విసిరేశాడు. దీంతో కూతురు సినా ముండా(5), రాజు ముండా(2)తోపాటు 6 నెలల శిశువు ముగ్గురూ కన్నుమూశారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులకు  సమాచారం అందింది. పిల్లల మృతదేహాలను బావిలోంచి వెలికితీశామని తెలిపారు. నిందితుడిని సమీపంలోని అడవిలో పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. తాగుబోతు తండ్రి కారణంగా అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలు గాల్లో కలవడంపై గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఈ బావిని ఊరి జనాలు వినియోగించుకుంటున్నారని సమాచారం.

Updated Date - 2022-05-01T22:44:40+05:30 IST