మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-06-30T04:56:46+05:30 IST
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్ర మత్తంగా ఉండాలని ఏఎస్ఐ శ్రీదేవి పేర్కొన్నారు.
కృష్ణ, జూన్ 29 : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్ర మత్తంగా ఉండాలని ఏఎస్ఐ శ్రీదేవి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మురహార్దొడ్డి గ్రామం లో పోలీస్ సురక్ష కళాజాత బృందం ద్వారా అవగా హన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మూ ఢ నమ్మకాలు, రోడ్డు భద్రత నిబంధనలు, పోలీస్ చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఎవరి మీదైన అనుమానం ఉంటే వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కళా బృందం సభ్యులు, సర్పంచు దేవేంద్రప్ప, సురేందర్ గౌడ్, శేఖర్, లింగన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
మక్తల్ రూరల్ : సైబర్ నేరాల పట్ల అప్రమత్తం గా ఉండాలని సీఐ సీతయ్య పేర్కొన్నారు. మక్తల్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవా రం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం చేప ట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అపరిచి త వ్యక్తులు కాల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాల న్నారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తుల పట్ల అనుమానం ఉంటే డయల్ 100కి సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే వాట్సాప్, ఫెస్బుక్, సోషల్ మీడియా ఇతర ఆన్లైన్ సర్వీసులపై అవగహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ రాములు, జీహె చ్ఎం అనిల్గౌడ్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.