డ్రగ్స్, కల్తీ లిక్కర్‌తో జాతి నిర్వీర్యం అవుతోంది: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-18T23:17:10+05:30 IST

డ్రగ్స్, కల్తీ లిక్కర్‌తో జాతీ నిర్వీర్యం అవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.

డ్రగ్స్, కల్తీ లిక్కర్‌తో జాతి నిర్వీర్యం అవుతోంది: చంద్రబాబు

అమరావతి: డ్రగ్స్, కల్తీ లిక్కర్‌తో జాతి నిర్వీర్యం అవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ముఖ్యనేతలతో  చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, హెరాయిన్ స్మగ్లర్‌లే రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్నారని ఆరోపించారు. పాడేరు ఏజెన్సీలో లిక్విడ్ గంజాయి, ఐస్‌క్రీం, చాక్లెట్ల తయారీ చేస్తున్నారని ఆరోపించారు. రెండున్నరేళ్లలో విద్యుత్ వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం పడిందని తెలిపారు. ప్రజా రక్షక పోలీస్ వ్యవస్థ.. ప్రజా భక్షక వ్యవస్థగా మారిందని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రైవేట్ కేసులు వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంద్రకీలాద్రి, తిరుమలలో అన్యమత ప్రచారం దుర్మార్గంమన్నారు. విమానాల్లో వాడే ఫ్యూయల్ కంటే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉందని విమర్శించారు. ఆరు దశల్లో పరిశీలన పేరుతో పెన్షన్, రేషన్ కార్డులు కోత పెడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

Updated Date - 2021-10-18T23:17:10+05:30 IST