ఏపీలో డ్రగ్స్కు రాచబాట వేశారు: కేశినేని నాని
ABN , First Publish Date - 2021-10-22T23:18:45+05:30 IST
ఏపీలో డ్రగ్స్కు రాచబాట వేశారని ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు
అమరావతి: ఏపీలో డ్రగ్స్కు రాచబాట వేశారని ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు, పిల్లలు ఎక్కడ డ్రగ్స్ బారిన పడుతారోననే భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో అరాచకాలను సహించమని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగ కేసులను పెట్టడం మానుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ను సంతోషపెట్టడానికి కొంతమంది గూండాగిరికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘దొంగచాటు వద్దు.. మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం.. డేట్.. ప్లేస్ మీరే చెప్పండి. మా వాళ్లు వస్తారు.. స్ట్రైట్ ఫైట్కి పాల్పడుదాం... రోజు విమర్శలతో ఏపీకి చెడ్డపేరు తేవొద్దు’’ అని కేశినేని నాని హెచ్చరించారు.