గోధుమకుంటలో డ్రోన్‌ సర్వే

ABN , First Publish Date - 2022-05-18T04:19:11+05:30 IST

గోధుమకుంటలో డ్రోన్‌ సర్వే

గోధుమకుంటలో డ్రోన్‌ సర్వే
డ్రోన్‌ ద్వారా సర్వే చేస్తున్న సర్వే ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు

కీసర, మే 17: దేశవ్యాప్తంగా 2025 నాటికి అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి యజమానికి అతని ఇంటికి సంబంధించి హక్కుదారుడి హోదా కల్పించి ఈ-ప్రాపర్టీ కార్డు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వేను సర్వే ఆఫ్‌ ఇండియా అధ్వర్యంలో స్వమిత్వ(సర్వే ఆఫ్‌ విలేజ్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రోవైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌) పేరిట కేంద్ర పంచాయతీ రాజ్‌, మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. అందులో భాగంగా మంగళవారం కీసర మండలం గోధుమకుంట గ్రామంలో డ్రోన్ల ద్వారా సర్వే చేశారు. ఇంటి యజమానితో మాట్లాడి నిర్మాణ ఉనికిని తెలుసుకొని ప్రత్యేక పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి, త్వరలో స్వమిత్వ కార్టు అందజేస్తామని సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో డీపీవో రమణమూర్తి, సర్పంచ్‌ మహేందర్‌రెడ్డి, హరీష్‌, పంచాయతీ కార్యదర్శి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T04:19:11+05:30 IST