Punjab: పఠాన్కోట్ సెక్టారులో మళ్లీ డ్రోన్ ప్రత్యక్షం...బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పులు
ABN , First Publish Date - 2021-10-06T14:48:11+05:30 IST
పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ సెక్టారులో మళ్లీ బుధవారం అనుమానాస్పద డ్రోన్ ప్రత్యక్షమైంది...
పఠాన్కోట్ (పంజాబ్): పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ సెక్టారులో మళ్లీ బుధవారం అనుమానాస్పద డ్రోన్ ప్రత్యక్షమైంది.పఠాన్కోట్ జిల్లా బమియాల్ సెక్టారులోని జైట్పూర్ కాషివాద్బా పోస్టు వద్ద ఓ గుర్తుతెలియని డ్రోన్ చక్కర్లు కొట్టింది. ఆకాశంలో డ్రోన్ చక్కర్లు కొడుతుండటంతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పులతో ఆకాశంలోని గుర్తుతెలియని డ్రోన్ అదృశ్యమైంది. డ్రోన్ సంచారంతో కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బీఎస్ఎఫ్ జవాన్లు బమియాల్ సెక్టారులో గాలింపు చేపట్టారు. జులై నెలలో పఠాన్ కోట్ భద్రతా సిబ్బందికి అనుమానాస్పద డ్రోన్ కనిపించింది.నెలరోజుల క్రితం జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్పై డ్రోన్ దాడి జరిగింది. మళ్లీ డ్రోన్ ప్రత్యక్షం కావడంతో పఠాన్ కోట్ జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు.