ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-01-19T05:28:06+05:30 IST
జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ఈ నెల 25వ తేదీన జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఆర్వో సి.చంద్రశేఖర్రెడ్డి ఆదేశించారు.
డీఆర్వో సీ చంద్రశేఖర్రెడ్డి
గుంటూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ఈ నెల 25వ తేదీన జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఆర్వో సి.చంద్రశేఖర్రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ నూతనంగా ఓటుహక్కు పొందిన ఓటర్లు, సీనియర్ సిటిజన్స్ని ప్రత్యేకంగా వేడుకలకు ఆహ్వానించాలని సూచించారు. సమావేశంలో డీఈవో ఆర్ఎస్ గంగాభవాని, ఇంటర్మీడియట్ ఆర్ఐవో జెడ్ఎస్ రామచంద్రరావు, గుంటూరు ఆర్డీవో భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.