తాండూరు రైల్వేస్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం

ABN , First Publish Date - 2021-10-29T05:00:42+05:30 IST

తాండూరు రైల్వేస్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం

తాండూరు రైల్వేస్టేషన్‌ను సందర్శించిన డీఆర్‌ఎం
అధికారులతో మాట్లాడుతున్న ఏకే.గుప్తా

తాండూరు : తాండూరు రైల్వే స్టేషన్‌ను సికింద్రాబాద్‌ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ ఏకే.గుప్తా గురువారం సందర్శించారు. రైల్వే స్టేషన్‌లోని వివిధ విభాగాలను, రైల్వే క్వార్టర్స్‌ను, చిల్డ్రన్స్‌ పార్కును ఆయన పరిశీలించారు. స్టేషన్‌ సమీపంలో కొనసాగుతున్న ట్రాక్‌ మరమ్మతు పనులు, పాత తాండూరు రైల్వే గేటును తనిఖీ చేశారు. అనంతరం కర్ణాటక రాష్ట్రం సేడం, చిత్తాపూర్‌ రైల్వే స్టేషన్లను కూడా పరిశీలించారు. రైల్వే ప్లాట్‌ ఫారాలు, టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, పార్కులు, మార్గ మధ్యలో రైల్వే వంతెనలు, సిగ్నల్స్‌ను పరిశీలించారు. త్వరలో దక్షిణ మధ్య రైల్వే శాఖ జీఎం ఇక్కడ పర్యటించనున్నారని తెలిపారు. ఆయా స్టేషన్లను సుందరీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. డీఆర్‌ఎం వెంట రైల్వే అధికారులు ఉన్నారు. 

Updated Date - 2021-10-29T05:00:42+05:30 IST