బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు... 28 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి...

ABN , First Publish Date - 2021-04-04T15:07:43+05:30 IST

హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 47 ఏళ్ల అశోక్ థాపా...

బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు... 28 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి...

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 47 ఏళ్ల అశోక్ థాపా తాను ప్రాణాపాయ స్థితిలో పడినప్పటికీ, ఎంతో అప్రమత్తతతో 28 మంది ప్రాణాలు కాపాడారు. ప్రైవేటు బస్సు నడుపుతున్న థాపాకు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో బస్సు అదుపుతప్పి లోయలో పడబోయింది. అయితే దీనిని గ్రహించిన థాపా బస్సును చెట్ల పొదల్లోకి పోనిచ్చి నిలిపివేశారు. 


ఈ విధంగా థాపా... బస్సులోని 28 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన శిమ్లా పరిధిలోని శిర్‌మౌర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఒక ప్రైవేటు బస్సు రేణుకాజీ సతౌన్ నుంచి పావంటా వైపు వెళుతోంది. ఈ సమయంలో బస్సు నడుపుతున్న థాపాకు గుండెపోటు వచ్చింది. కళ్లు మూతపడుతున్నాయి. తన పరిస్థితిని గ్రహించిన థాపా వెంటనే బస్సును చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి నిలిపివేశారు. థాపా పరిస్థితిని గమనించిన ప్రయాణికులు అతనిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ థాపా మృతి చెందారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకుర్ మాట్లాడుతూ థాపాను ఆసుపత్రికి తీసుకువచ్చేలోగానే అతను మృతి చెందారని తెలిపారు. గుండెపోటు కారణంగా థాపా మృతి చెందారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-04T15:07:43+05:30 IST