డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతిపై న్యాయవిచారణ చేపట్టాలి

ABN , First Publish Date - 2022-05-24T06:39:47+05:30 IST

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతిపై నిష్పక్షపాతంగా న్యాయ విచారణ చేపట్టి అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండు చేశారు.

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతిపై న్యాయవిచారణ చేపట్టాలి

కొత్తపేట, మే 23: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతిపై నిష్పక్షపాతంగా న్యాయ విచారణ  చేపట్టి అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండు చేశారు. సోమవారం ఆయన దళితులతో కలిసి కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. టీడీపీ నాయకులు కంఠంశెట్టి శ్రీను, బూశి జయలక్ష్మి  భాస్కరరావు, ముత్యాల బాబ్జీ, గుబ్బల మూర్తి, మిద్దే ఆదినారాయణ, అద్దంకి చంటిబాబు, చోడపనీడి భాస్కరరావు, ముద్రగడ ఫణి, బండి రాజు, బయ్యే రాంబాబు, చీకురుమిల్లి జాన్‌ పాల్గొన్నారు.

మండపేట:  కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక 7వ వార్డులో సోమవారం టీడీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వ ర్యంలో కొవ్వొత్తులతో  నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మంలో నియో జకవర్గ టీడీపీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు మంద పల్లి దొరబాబు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ జాన్‌ సుందర్రాజు, దళిత రత్న వెంటపల్లి జాన్‌మార్క్‌, కోడి చిన్న అప్పారావు, 8వ వార్డు టీడీపీ ఇన్‌చార్జి పెందుర్తి ప్రదీప్‌ కుమార్‌, బడుగు రత్నంరాజు, వల్లూరి దొరకయ్య, గంధం పవన్‌, గంధం రాజేష్‌, మోరంపూడి విజయ్‌, తాతపూడి ఉగాది, నియోజక వర్గం ఎస్సీ సెల్‌ నాయకులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-24T06:39:47+05:30 IST