bulldozerపై వరుడి ఊరేగింపు...డ్రైవరుకు జరిమానా

ABN , First Publish Date - 2022-06-24T13:11:15+05:30 IST

పెళ్లి ఊరేగింపులో వరుడిని వాహనంలో ఎక్కించుకున్న బుల్డోజర్ డ్రైవర్‌కు...

bulldozerపై వరుడి ఊరేగింపు...డ్రైవరుకు జరిమానా

భోపాల్ (మధ్యప్రదేశ్) : పెళ్లి ఊరేగింపులో వరుడిని వాహనంలో ఎక్కించుకున్న బుల్డోజర్ డ్రైవర్‌కు మధ్యప్రదేశ్ పోలీసులు రూ.5,000 జరిమానా విధించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో జరిగింది.వరుడు బుల్డోజర్ ముందు బ్లేడ్లపై కూర్చున్నాడు.బుల్డోజర్ డ్రైవర్ రవిభాస్కర్‌పై మోటారు వాహన చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బుల్‌డోజర్‌లను వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని, ప్రజా రవాణా కోసం కాదని పోలీసులు చెప్పారు.బెతుల్‌లోని కెర్పాని గ్రామంలో జూన్ 21వతేదీ రాత్రి బుల్డోజరుపై పెళ్లి ఊరేగింపు జరిగింది. వరుడు తన వివాహ వేదిక వద్దకు చేరుకోవడానికి సాధారణ కారు లేదా గుర్రానికి బదులుగా బుల్డోజర్‌పై ప్రయాణించాడు.


అంకుష్ జైస్వాల్ అనే వరుడు కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి బుల్డోజర్ ముందు బ్లేడ్‌లపై కూర్చుని వివాహ మండపానికి వచ్చాడు. జైస్వాల్ టాటా కన్సల్టెన్సీలో సివిల్ ఇంజనీర్.పెళ్లి ఊరేగింపు చూసి ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో తమ దృష్టికి వచ్చిందని, డ్రైవర్‌కు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2022-06-24T13:11:15+05:30 IST