రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2022-08-12T05:30:00+05:30 IST

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి
మృతుడు ఓబుల్‌రాజు

కొత్తూర్‌, ఆగస్టు 12: తిమ్మాపూర్‌ సమీపంలో చేగూర్‌ చౌరస్తా వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌ మృతిచెందాడు. ఎస్‌ఐ సయూద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. డీసీఎం డ్రైవర్‌ ఓబుల్‌ రాజు(46) హైదరాబాద్‌ నుంచి అనంతపురం వెళ్తూ కర్నూల్‌వైపు వెళ్తున్న కంటైనర్‌ ను ఢీకొన్నాడు. దీంతో ఓబుల్‌ రాజు డీసీఎంలో ఇరుక్కొని మృతిచెందాడు. క్రేన్‌ సాయంతో మృతదేహాన్ని బయటకుతీసి శవపరీక్ష కోసం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు ఏపీలోని అనంతపురానికి చెందినవాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సయూద్‌ తెలిపారు.  

Updated Date - 2022-08-12T05:30:00+05:30 IST