వర్షపు నీటిని ఒడిసి పట్టాలి : చైర్మన
ABN , First Publish Date - 2021-05-17T06:13:12+05:30 IST
వర్షపు నీటిని ఒడిసి పట్టాలని మునిసిపల్ చై ర్మన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు.
చిట్యాల, మే16 : వర్షపు నీటిని ఒడిసి పట్టాలని మునిసిపల్ చై ర్మన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన చిట్యాలలో జలశక్తి ప్రచార రథం ప్రారంభించి మాట్లాడారు. మానవ జీవితంలో నీటికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. నీరు లేనిదే మానవజాతి మనుగడ లేదన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్డడంతో భూగర్భ జలాలు పెంచుకోవాలన్నారు. నీటిని వృథా చేయవద్దన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన కూరెళ్ళ లింగస్వామి, కమిషనర్ మందడి రామదుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హాలియా : కలెక్టర్ ఆదేశాల మేరకు జలశక్తి అభియాన్ ప్రచార రథాన్ని హాలియా మునిసిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేమనరెడ్డి, వార్డు కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, అన్నెపాక శ్రీనివాస్, ప్రసాద్నాయక్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండలంలో ఈ నెల 17నుంచి 25 వరకు జలశక్తి అభియాన్పై కళాజాతను నిర్వహించనున్నట్లు ఏపీవో గుంటుక వె ంకటేశం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.