తాగు నీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చూడాలి
ABN , First Publish Date - 2022-05-24T05:30:00+05:30 IST
మిషన్ భగీరథ నీటిని ఆటంకాల్లేకుండా సరఫరా చే యాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే సరి చేయాలని జడ్పీ చైర్పర్సన్ స్వర్ణా సుధాక ర్రెడ్డి సూచించారు.
- స్థాయీ సంఘం సమావేశంలో జడ్పీ చైర్పర్సన్
మహబూబ్నగర్ టౌన్, మే 24 : మిషన్ భగీరథ నీటిని ఆటంకాల్లేకుండా సరఫరా చే యాలని, ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే సరి చేయాలని జడ్పీ చైర్పర్సన్ స్వర్ణా సుధాక ర్రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని చైర్పర్సన్ చాంబర్లో జరిగిన రెండోస్థాయీ సంఘ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. సీసీ కుంట మండలంలో ఈ సమస్య ఉందని, తక్షణం పరిష్కరించాలని ఈఈని ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను వెంటనే చెల్లించాలని సూచించారు. వర్షాలు మొదలైనందున వడ్ల కొనుగోలు వేగవంతంచేసి పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో స్థాయీ సంఘం సభ్యులు, ఆయా శాఖల ధికారులు పాల్గొన్నారు.