రూ.700 కోట్లతో ఉద్దానానికి తాగునీరు

ABN , First Publish Date - 2020-09-20T17:50:48+05:30 IST

ఉద్దానం ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.700 కోట్లతో పనులు చేపడుతున్నట్లు..

రూ.700 కోట్లతో ఉద్దానానికి తాగునీరు

(మెళియాపుట్టి/శ్రీకాకుళం): ఉద్దానం ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.700 కోట్లతో పనులు చేపడుతున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈ పనుల్లో భాగంగా చేపడుతున్న మెగా వాటర్‌ గ్రిడ్‌ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ.. మెళియాపుట్టి వద్ద ట్యాంకు నిర్మిస్తున్న ప్రాంతంలో తమకు చెందిన డి-పట్టా భూములు తీసుకోవడం వల్ల ఉపాధి కోల్పోయామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా నష్టపరిహారం ఇవ్వడం తన చేతిలో లేదని, కొందరికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఆయనతో పాటు డీఈ దామోదరరావు, జేఈ మహేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-09-20T17:50:48+05:30 IST