దాహం వేసినప్పుడే నీళ్లు తాగొచ్చులే అని తేలిగ్గా తీసుకుంటున్నారా.. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా?
ABN , First Publish Date - 2021-10-19T18:16:45+05:30 IST
దాహం వేసినప్పుడే కాదు, వేయనప్పుడూ నీళ్లు తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గి, ప్రతి అణువూ నీటి కోసం అల్లాడిపోతూ, దాహం ద్వారా మనకు నీళ్లు తాగే విషయాన్ని గుర్తు చేసే సమయానికంటే ముందే నీళ్లు తాగడం అవసరం. నీళ్లదేముంది? వాటి వల్ల ఉపయోగాలేముంటాయి? అని కొట్టిపారేయకండి. నీటితోనూ కొన్ని ప్రయోజనాలున్నాయి.
ఆంధ్రజ్యోతి(19-10-2021)
దాహం వేసినప్పుడే కాదు, వేయనప్పుడూ నీళ్లు తాగాలి. శరీరంలో నీటి శాతం తగ్గి, ప్రతి అణువూ నీటి కోసం అల్లాడిపోతూ, దాహం ద్వారా మనకు నీళ్లు తాగే విషయాన్ని గుర్తు చేసే సమయానికంటే ముందే నీళ్లు తాగడం అవసరం. నీళ్లదేముంది? వాటి వల్ల ఉపయోగాలేముంటాయి? అని కొట్టిపారేయకండి. నీటితోనూ కొన్ని ప్రయోజనాలున్నాయి.
గుండె పనితీరు భేషుగ్గా ఉండాలంటే సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.
రక్తప్రసరణ మెరుగ్గా జరగాలంటే శరీరంలో అందుకు సరిపడా నీరుండాలి.
శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు సాఫీగా బయటకు వెళ్లిపోవాలంటే తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి.
తినే ఆహారంలోని పోషకాలను శరీరం శోషణ చేసుకోవాలన్నా నీరు తాగవలసిందే!
కండరాలు, ఎముకల దృఢత్వం కోసం నీళ్లు తాగడం అవసరం. నీటి కొరత వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వేధిస్తాయి.
మెదడు పనితీరు మెరుగ్గా ఉండడం కోసం, ఆలోచనల్లో స్పష్టత లోపించకుండా ఉండడం కోసం నీరు తాగడం అవసరం.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండాలన్నా సరిపడా నీరు తాగాలి.
నోటి దుర్వాసన వేధించకుండా ఉండాలన్నా నీళ్లు సరిపడా తాగుతూ ఉండాలి.