డ్రైనేజి క్లీనింగ్ యంత్రం మంజూరు
ABN , First Publish Date - 2021-04-17T06:02:48+05:30 IST
మండలానికి ఎస్సీ కార్పొరేషన్ నిధులతో మం జూరైన డ్రైనేజి క్లీనింగ్ యంత్రాన్ని శుక్రవారం ఇన్చార్జి ఎంపీడీవో అప్పా జీ సంగంలో ప్రారంభించారు.
సంగం, ఏప్రిల్ 16: మండలానికి ఎస్సీ కార్పొరేషన్ నిధులతో మం జూరైన డ్రైనేజి క్లీనింగ్ యంత్రాన్ని శుక్రవారం ఇన్చార్జి ఎంపీడీవో అప్పా జీ సంగంలో ప్రారంభించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రతి మండలానికి గ్రామాల్లో మురుగు కాలువల్లో పూడిక తీయడానికి ఒక యంత్రాన్ని మంజూరు చేసింది. ప్రభుత్వం మారడంతో మంజూరైన యంత్రాలు ఎస్సీ కార్పొరేషన్లో ఉండిపోయాయి. ఎట్టకేలకు ప్రభుత్వం వాటిని మండలాలకు కేటాయించారు. ప్రతి గ్రామంలో 15 రోజులకొకసారి డ్రైనేజీల్లో పూడిక తీసేందుకు ప్రభుత్వం క్లీనింగ్ యంత్రాన్ని మం జూరు చేసిందని ఎంపీడీవో తెలిపారు.