హర్యానాలో రెండు కొవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్న డీఆర్‌డీవో

ABN , First Publish Date - 2021-04-21T19:51:37+05:30 IST

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) మరో రెండు కొవిడ్-19 ఆస్పత్రులు...

హర్యానాలో రెండు కొవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్న డీఆర్‌డీవో

చండీగఢ్: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) మరో రెండు కొవిడ్-19 ఆస్పత్రులు నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. హర్యానాలోని హిసార్, పానిపట్ నగరాల్లో 500 పడకల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు హర్యానా హోంశాఖ, ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. ఈ ఆస్పత్రులకు డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిని అందించాలని ఆర్మీ వెస్ట్రన్ కమాండ్‌ను కోరినట్టు ఆయన తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన ఈ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నట్టు విజ్ పేర్కొన్నారు. గడచిన మూడు వారాల్లో హర్యానాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 7,811 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-04-21T19:51:37+05:30 IST