డ్రోన్లను నిర్వీర్యం చేసే టెక్నాలజీని డీఆర్డీఓ తయారు చేసింది: సతీష్రెడ్డి
ABN , First Publish Date - 2021-07-25T21:02:14+05:30 IST
డ్రోన్లను నిర్వీర్యం చేసే టెక్నాలజీని డీఆర్డీఓ తయారు చేసింది: సతీష్రెడ్డి
హైదరాబాద్: సరిహద్దుల్లో డ్రోన్స్ను పసిగట్టి వాటిని నిర్వీర్యం చేసే టెక్నాలజీని డీఆర్డీఓ తయారు చేసిందని ఏబీఎన్తో డీఆర్డీఓ చైర్మన్ సతీష్రెడ్డి స్పష్టం చేశారు. వీటి యొక్క పనితీరును ఆగస్టు 15, రిపబ్లిక్ డే రోజున సైన్యానికి కూడా చూపించామని ఆయన అన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్తో పాటు ప్రైవేట్ ఇండస్ట్రీలో వీటినితయారు చేయబోతున్నారని, రక్షణ వ్యవస్థలో ముందంజలో ఉన్న దేశాలతో సరిసమానంగా ఉన్నామని సతీష్రెడ్డి పేర్కొన్నారు.