డీఆర్‌డీఏ పీడీగా సునీత బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-10-19T05:04:45+05:30 IST

డీఆర్‌డీఏ పీడీగా సునీత బాధ్యతల స్వీకరణ

డీఆర్‌డీఏ పీడీగా సునీత బాధ్యతల స్వీకరణ

విజయవాడ రూరల్‌, అక్టోబరు 18 : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ప్రాజెక్టు డైరెక్టర్‌గా (పీడీ)  విజయవాడ రూరల్‌ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) జుజ్జవరపు సునీత సోమవారం గొల్లపూడిలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పీడీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్‌ ఎం.శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా పరిషత్‌ సీఈవోగా బదిలీ కావడంతో సునీతకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె డీఆర్‌డీఏ అధికారులు, కార్యాలయ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లి కలెక్టర్‌ నివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - 2021-10-19T05:04:45+05:30 IST