పులపర్తిలో మహిళలతో డీఆర్‌డీఏ పీడీ సమావేశం

ABN , First Publish Date - 2020-11-29T06:06:54+05:30 IST

మండలంలోని పులపర్తిలో గల మహిళలతో శనివారం డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు సమావేశమయ్యారు.

పులపర్తిలో మహిళలతో డీఆర్‌డీఏ పీడీ సమావేశం
మహిళలతో మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు

 ఎలమంచిలి రూరల్‌, నవంబరు 28 : మండలంలోని పులపర్తిలో గల మహిళలతో శనివారం డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు సమావేశమయ్యారు. శుక్రవారం ఈ గ్రామానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ వద్ద వైఎస్సార్‌ చేయూత పథకం సాయం తమకు అందలేదని పలువురు మహిళలు వాపోయిన నేపథ్యంలో ఆయన వెంటనే స్పందించిన పీడీని గ్రామానికి పంపారు. ఈ సందర్భంగా  పీడీ మహిళలతో మాట్లాడి అన్ని వివరాలను తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు  సమర్పించనున్నట్టు చెప్పారు.  వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు, శ్రీనిధి మేనేజర్‌ కరుణానిధి తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:06:54+05:30 IST