ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు..

ABN , First Publish Date - 2021-10-01T16:50:28+05:30 IST

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు..

అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును కేబినెట్‌ మంత్రి హోదాలో (సమగ్ర క్యాన్సర్‌ సంరక్షణగా) నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రేడియేషన్‌ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞుడు, ప్రఖ్యాత వైద్యుడిగా పేరుపొందారు. ఆయన్ని కేబినెట్‌ హోదాలో రెండు సంవత్సరాల పదవీకాలంతో సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. క్యాన్సర్‌ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్‌ నోరిని ముఖ్యమంత్రి కోరిన విషయం విదితమే. 

Updated Date - 2021-10-01T16:50:28+05:30 IST