ఈ మూడూ పాటిస్తే ఏ వేరియంట్కైనా చెక్: ఎయిమ్స్ చీఫ్
ABN , First Publish Date - 2021-06-24T04:39:33+05:30 IST
టీకాలు వేయడం, అవసరమైనప్పుడు లాక్ డౌన్ విధించడం, కోవిడ్ ప్రోటోకాల్ను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ఏ వేరియంట్నైనా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: టీకాలు వేయడం, అవసరమైనప్పుడు లాక్ డౌన్ విధించడం, కోవిడ్ ప్రోటోకాల్ను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ఏ వేరియంట్నైనా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా వ్యాఖ్యానించారు. ‘‘డెల్టా ప్లస్ సమస్యలు సృష్టిస్తోందని ప్రస్తుతం చెప్పడం కష్టం. అంతమాత్రనా మనం అజాగ్రత్తగా మారిపోకూడదు. కేసు పెరుగుదలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. మూడో వేవ్ను అడ్డుకునేందుకు మనందరం అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్ ప్రోటోకాల్కు కట్టుబడి ఉండాలి. అనుమానితుల్ని గుర్తించి పరీక్షించడంతో పాటూ మేజారిటీ ప్రజలకు టీకా అందేలా చూడాలి’’ అని ఆయన సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తున్నంత కాలం ఎటువంటి వేరియంట్ వచ్చినా సమాజంపై ఎటువంటి ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు.