డాక్టర్ చెర్లో రమణారెడ్డి వర్ధంతి సభ
ABN , First Publish Date - 2020-05-27T10:33:26+05:30 IST
ప్రజావైద్యుడిగా పేరుపొందిన పేదల పక్షపాతి డాక్టర్ చెర్లో రమణారెడ్డి 21వ వర్ధంతి సభను సీపీఎం కార్యాలయంలో మంగళవారం ..
ఆత్మకూరు, మే 26 : ప్రజావైద్యుడిగా పేరుపొందిన పేదల పక్షపాతి డాక్టర్ చెర్లో రమణారెడ్డి 21వ వర్ధంతి సభను సీపీఎం కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ముందుగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దోర్నాదుల సురేష్బాబు, మాజీ ఎంపీపీ డాక్టర్ బీ రవీంద్రనాధ్రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి, పలువురు సీపీఎం నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్ట్వాదిగా మారి రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాలలో పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించారని కొనియాడారు.
అనంతరం డాక్టర్ బీఎస్ఆర్ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాధ్రెడ్డికి ఉత్తమ సేవా పురష్కార సన్మానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు చెర్లో సుబ్బరామిరెడ్డ్డి, సీపీఎం, సీఐటీయూ, అనుబంధసంఘాల నాయకులు, నేతలు ఎం.నాగేంద్ర, ఆత్మకూరు నాగయ్య, గంటా లక్ష్మిపతి, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జీ.శివప్రసాద్, ఆళ్ల హజరత్తయ్య, కొండమూరు హజరత్తయ్య, హరికృష్ణ పాల్గొన్నారు.