డాక్టర్ ఆనంద్కు సేవా భారత్ అవార్డ్
ABN , First Publish Date - 2021-04-18T22:26:55+05:30 IST
గత కొన్నేళ్లుగా సామాజిక కార్యకర్తగా అత్యంత విలువైన సేవలు అందిస్తున్న డాక్టర్ ఆనంద్ను ‘సేవా భారత్’ అవార్డు వరించింది.
హైదరాబాద్: గత కొన్నేళ్లుగా సామాజిక కార్యకర్తగా అత్యంత విలువైన సేవలు అందిస్తున్న డాక్టర్ ఆనంద్ను ‘సేవా భారత్’ అవార్డు వరించింది. తన బంజారా మహిళా యన్జీవో తరపున నిర్విరామంగా పేదలు, వృద్ధులు, అనాథలు, వలస కూలీల కోసం విభిన్న కార్యక్రమాలు చేపడుతున్న కారణంగా.. ఈ అవార్డు అందించారు. లాక్డౌన్ సమయంలో వలస కూలీలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం, అన్నదానాలు నిర్వహించండం, కోవిడ్ కిట్ల పంపిణీ తదితర కార్యక్రమాలను డాక్టర్ ఆనంద్ నిర్వహించారు. ఎన్నో వేల మందికి అండగా నిలిచిన ఆనంద్ సేవలను గుర్తించి ‘సేవా భారత్’ కోవిడ్ వారియర్ అవార్డును ప్రకటించారు. హోం క్వారంటైన్లో ఉన్న ఆనంద్ తరపున ప్రశాంత్ ఈ అవార్డును అందుకున్నారు. తమ సేవలను గుర్తించిన యాజమాన్యానికి, తన మిత్రులకు డాక్టర్ ఆనంద్ ధన్య వాదాలు తెలియజేశారు. రవీంద్ర భారతిలో శనివారం జరిగిన అవార్డుల కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మి నారాయణ, హెవెన్ హోమ్స్ వరలక్ష్మి హాజరయ్యారు.