పేద విద్యార్దుల కోసం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విరాళం
ABN , First Publish Date - 2021-11-06T23:23:20+05:30 IST
పేద విద్యార్ధులను ఆదుకోవాలన్న రాష్ట గవర్న తమిళిసై సౌందర రాజన్ ఇచ్చిన పిలుపునకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్పందించింది.
హైదరాబాద్: పేద విద్యార్ధులను ఆదుకోవాలన్న రాష్ట గవర్న తమిళిసై సౌందర రాజన్ ఇచ్చిన పిలుపునకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్పందించింది. ఈ మేరకు శనివారం రాజ్ భవన్ కు వచ్చిన డిపీఎస్ ప్రతినిదులు పేద విద్యార్ధులకు తమ వంత సాయంగా 50 ట్యాబ్స్ విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. పేద విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసుల ద్వరా విద్యనభ్యసించడానికి కష్టంగా ఉంటుందని, వారి చదువును కొనసాగించేందుకు డీపీఎస్ చేసిన సాయాన్ని గవర్నర్ ప్రశంసించారు. గవర్నర్ ను కలిసిన వారిలో డీపీఎస్ డైరెక్టర్ గోరంట్ల రమేశ్, ఇతర ప్రతినిధులు గోరంట్లస్వప్న, సాన్యు, సూర్యమోహన్, సీతారామయ్య తదితరులు ఉన్నారు. మొదటి విడతగా రెండు ట్యాబ్స్ ను వారు గవర్నర్ కు అందజేశారు.