చీర్యాల్లో డీపీవో పర్యటన
ABN , First Publish Date - 2020-09-25T10:07:07+05:30 IST
మండలంలో ని చీర్యాల్ గ్రామంలో గురు వారం జిల్లా పం చాయతీ అధికారి పద్మజారాణి పర్యటించారు.
కీసర: మండలంలోని చీర్యాల్ గ్రామంలో గురు వారం జిల్లా పం చాయతీ అధికారి పద్మజారాణి పర్యటించారు. గ్రామం లోని పల్లెప్రకృతివనం, డంపింగ్యార్డు, వైకుంఠఽ ధామంతో పాటు పారిశుధ్య పనులను పరిశీలించారు. పల్లెప్రగతిలో చేసిన పలు అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ధర్మేందర్, ఉపసర్పంచ్ తిరుమల్రెడ్డి, కార్యదర్శి శోభ తదితరులు పాల్గొన్నారు.