‘కులమతాల పేరిట బీజేపీ హింసా యత్నం’

ABN , First Publish Date - 2020-10-28T15:55:21+05:30 IST

రాష్ట్రంలో కులమతాలు రెచ్చగొట్టి హింసాకాండ సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని డీపీఐ అధ్యక్షుడు తిరుమావళవన్‌ ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఏడాది వైద్య విద్యలో ఓబీసీ విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ నేడు ఆందోళన

‘కులమతాల పేరిట బీజేపీ హింసా యత్నం’

చెన్నై : రాష్ట్రంలో కులమతాలు రెచ్చగొట్టి హింసాకాండ సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని డీపీఐ అధ్యక్షుడు తిరుమావళవన్‌ ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఏడాది వైద్య విద్యలో ఓబీసీ విద్యార్థులకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ నేడు ఆందోళన చేపట్టనున్నామన్నారు. బీజేపీ సీనియర్‌ నేతలతో పాటు పలువురు వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కులమతాల పేరిట చిచ్చుపెట్టే చర్యలు ప్రారంభించారన్నారు. మహిళల గురించి బీజేపీ నేతలే తప్పుగా మాట్లాడుతున్నారని, వారిపై రాష్ట్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తాను మహిళల గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించి తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన మాటలను వక్రీకరించిన వారిని అరెస్ట్‌ చేయాలని కోరుతూ ఈ నెల 31వ తేది రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. మనుస్మృతి గ్రంథంపై మహిళలకు అవగాహన కల్పించేలా నవంబరు 3, 4, 5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి వివరించనున్నామని తిరుమావళవన్‌ తెలిపారు.

Updated Date - 2020-10-28T15:55:21+05:30 IST