వైసీపీ అంతిమ ఘడియలకు నాంది

ABN , First Publish Date - 2021-10-20T05:10:43+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయంపైనే వైసీపీ గుండాలు దాడులు చేయడం హేయమని, ఆ పార్టీ దౌర్జన్యపాలనకు పరాకాష్ట అని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు ధ్వజమెత్తారు

వైసీపీ అంతిమ ఘడియలకు నాంది
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు ధ్వజం


మదనపల్లె టౌన్‌, అక్టోబరు 19: టీడీపీ కేంద్ర కార్యాలయంపైనే వైసీపీ గుండాలు దాడులు చేయడం హేయమని, ఆ పార్టీ దౌర్జన్యపాలనకు పరాకాష్ట అని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు ధ్వజమెత్తారు. మంగళవారం రాత్రి రాజం పేట టీడీపీ పార్లమెంటరీ పార్టీ కా ర్యాల యంలో మీడియా సమావేశం నిర్వ హిం చారు. ఈ సందర్భంగా చినబాబు  మాట్లా డుతూ... ప్రభుత్వ అవినీతి, అరాచకాలను ప్రశ్నించిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గుం డాలు దాడి చేశారన్నారు. డీజీపీ కార్యాల యానికి కూతవేటు దూరంలోనే ఈ ఘ టన జరు గుతున్నా... అడ్డుకోలేక పోవడం పోలీసుల వైఫల్యానికి నిదర్శన మన్నారు. విద్యుత్‌ చార్జీల పై టీడీపీ శ్రేణులు నిరస నలు తెలుపుతుంటే జీర్ణిం చుకోలేని వైసీపీ నాయ కులు పలుచోట్ల దాడులు దిగుతున్నారన్నారు. వీటిని అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి అం తిమ ఘడియలు వస్తున్నాయని, రాబో యేది టీడీపీ పాలనే అని ప్రతి ఒక్కరిని పేరుపేరునా గుర్తుపెట్టుకుని తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించ్నారు. కార్యక్ర మంలో తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి రాట కొండ మధుబాబు,  రాజంపేట పార్ల మెంటరీ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, ఉపాధ్యక్షుడు జంగాల వెంకట రమణ, అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేష్‌, కార్యనిర్వాహక కార్యదర్శి ఖాదర్‌ఖాన్‌, పెంచుపాడు స్వామి, మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:10:43+05:30 IST