అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-04-11T06:37:07+05:30 IST
అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు, ఆడపడుచు, బంధువులు వేధింపులకు గురి చేస్తున్నారని కొత్తలంక ఏఎన్ఎం బలగం లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ముమ్మిడివరం, ఏప్రిల్ 10: అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు, ఆడపడుచు, బంధువులు వేధింపులకు గురి చేస్తున్నారని కొత్తలంక ఏఎన్ఎం బలగం లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. లలితకు 2006లో చింతపల్లిలంకకు చెందిన రవివర్మతో వివాహం జరిగింది. రూ.1.50లక్షలు కట్నం, 8కాసులు బంగారం, 5సెంట్లు స్థలం, ఇతర లాంచనాలు ఇచ్చారు. అయితే అదనపు కట్నం తీసుకురమ్మని భర్త రవివర్మ, అత్తమామలు సత్యనారాయణమ్మ, నాగేశ్వరరావు, ఆడపడుచు నాగవేణి, బంధువులు అర్దాని మాధవి, మల్లాడి సత్యవేణి, అర్దాని రమణ వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కేవీ నాగార్జున తెలిపారు.