వేగవంతంగా అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2020-11-30T06:22:25+05:30 IST

వైసీపీ ప్రభుత్వ హయాంలో అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని మాజీ ఎ మ్మెల్యే డాక్టర్‌ బాచిన చెంచుగరటయ్య, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు.

వేగవంతంగా అభివృద్ధి పనులు
ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న బాచిన చెంచుగరటయ్య, కృష్ణచైతన్య

మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య


పంగులూరు, నవంబరు 29 : వైసీపీ ప్రభుత్వ హయాంలో అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని మాజీ ఎ మ్మెల్యే డాక్టర్‌ బాచిన చెంచుగరటయ్య, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు. మండలంలోని కొండముంజులూరులో రూ.15 లక్షల నిధులతో గ్రామ ఆరోగ్య కేంద్ర నూతన భవన నిర్మాణానికి చైతన్య ఆదివారం భూమిపూజ చేశారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరీ వీరభద్రస్వామి నూతన ఆలయ కమిటీ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ భువనేశ్వరి, ఏఈ రా మకుమార్‌,  మాజీ చైర్మన్‌ జంపని రవిబాబు, ఎర్రం శ్రీనివాసరెడ్డి, సుబ్బారావు, బొప్పూడి వెంకన్నబాబు, మస్తానరావు, ఆదిరెడ్డి, ఆలయ క మిటీ చైర్మన్‌ బత్తుల కోటయ్య, నాగేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు. బూదవాడలో దెబ్బతిన్న మిరప పంటను కృష్ణచైతన్య పరిశీలించారు.  

బల్లికురవ : దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు వెంటనే న మోదు చేయాలని బాచిన కృష్ణచైతన్య సూచించారు. ఆదివారం మండ లంలోని కొప్పెరపాడు, కూకట్లపల్లి గ్రామాల్లో మునిగిని పంటలను పరిశీలించారు. సంతమాగులూరు ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ చింతల పేరయ్యచౌదరి, తహసీల్దార్‌ అశోక్‌వర్దన్‌, ఏవో కుమారి, వైసీపీ నా యకులు మక్కెన రామారావు, శ్రీనివాసరావు, నరేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-30T06:22:25+05:30 IST