డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఖాళీ చేయాలి

ABN , First Publish Date - 2022-06-26T03:58:50+05:30 IST

జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లలోకి ప్రవేశించిన వారిని ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇండ్లను ఆక్రమించుకున్న వారితో చర్చలు జరిపారు. ఇండ్లను ఖాళీ చేయాలని, అక్రమంగా చొరబడితే లాటరీ కేటాయింపులో ఇల్లు దక్కే అవకాశం ఉండదని అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

డబుల్‌ బెడ్రూం ఇండ్లను ఖాళీ చేయాలి
డబుల్‌బెడ్‌రూం ఇండ్లను ఆక్రమించిన వారితో మాట్లాడుతున్న పోలీసు, రెవెన్యూ అధికారులు

ఏసీసీ, జూన్‌ 25: జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లలోకి ప్రవేశించిన వారిని ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇండ్లను ఆక్రమించుకున్న వారితో చర్చలు జరిపారు. ఇండ్లను ఖాళీ చేయాలని, అక్రమంగా చొరబడితే లాటరీ కేటాయింపులో ఇల్లు దక్కే అవకాశం ఉండదని అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తాము నిరుపేదలమని ఇండ్లలో నుంచి వెళ్లేది లేదని భీష్మీంచుకు కూర్చున్నారు.

 

Updated Date - 2022-06-26T03:58:50+05:30 IST