Double bedroom ఇప్పిస్తానని టీఆర్ఎస్ నేత మోసం.. పోలీసులకు ఫిర్యాదు చేయగా..!
ABN , First Publish Date - 2021-12-23T13:31:29+05:30 IST
Double bedroom ఇప్పిస్తానని టీఆర్ఎస్ నేత మోసం.. పోలీసులకు ఫిర్యాదు చేయగా..
హైదరాబాద్ సిటీ/ఏఎస్రావునగర్ : డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని చర్లపల్లి డివిజన్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు డబ్బులు తీసుకుని మోసం చేశాడని పలువురు బాధితులు బుధవారం కుషాయిగూడ పోలీసులను ఆశ్రయించారు. చిన్న చర్లపల్లికి చెందిన మేక పద్మ, అల్లిపురం ప్రసాద్లు చర్లపల్లి పారిశ్రామికవాడ కంపెనీల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి సొంత ఇళ్లు లేవు. పెద్ద చర్లపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు బొడిగే ప్రభాకర్గౌడ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని పది నెలల కిందట ఇద్దరి నుంచి రూ.50 వేల చొప్పున మొత్తం లక్ష రూపాయలు తీసుకున్నాడు.
త్వరలోనే ఆన్లైన్లో ఇళ్ల మంజూరుకు సంబంధించిన ఓటీపీ వస్తుందని నమ్మించాడు. నెలలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేకపోవడంతో బాధితులు ప్రభాకర్గౌడ్ను పలుమార్లు ఇళ్ల గురించి అడిగారు. ఏం చేసుకుంటారో.. చేసుకోండి’ అని బెదిరించసాగాడు. బాధితులు చేసేది లేక పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు నిందితుడు ప్రభాకర్గౌడ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చీటింగ్, బెదిరింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులతో ఓ కార్పొరేటర్ మాట్లాడి నిందితుడితో రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.